తిరుమలలో భక్తుల రద్దీ | devotees rush in tirumala| pilgrims| hundikanukalu| compartments| sarva| darshnam
posted on Sep 2, 2023 7:23AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని 28వేల193 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 28వేల 750 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక హుండీ ఆదాయం 3 కోట్ల 62 లక్షల రూపాయలు వచ్చింది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది.