Leading News Portal in Telugu

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు | devotees rush continues in tirumala| pilgrims| hundi| adayam| compartments


posted on Sep 5, 2023 10:44AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (సెప్టెంబర్ 3) శ్రీవారిని 76వేల 555 మంది దర్శించుకున్నారు.

వారిలో 33 వేల 488 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 75 లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 4) శ్రీవారి భక్తుల కోసం వేచి చూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.