తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | devotees rush continue in tirumala| piligrims| compartments| full| tonsures| sarvadarshnam
posted on Sep 12, 2023 11:16AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారిని 66వేల 199 మంది దర్శించుకున్నారు. వారిలో 29వేల 351 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 4.17 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.