Leading News Portal in Telugu

తిరుమలలో కొనసాగుతున్న శ్రీవారి భక్తుల రద్దీ | devotees rush continue in tirumala| pilgrims| compartments| hundi| kanukalu


posted on Sep 13, 2023 9:59AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (సెప్టెంబర్ 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 12) శ్రీవారిని 70వేల55 మంది భక్తుల సందర్శించుకున్నారు.

వారిలో 27వేల 724 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల 32లక్షల రూపాయలుగా ఉంది.