తిరుమల శ్రీవారి దర్శనానికి 14 గంటలు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Sep 14, 2023 9:31AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (సెప్టెంబర్ 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 13) తిరుమల శ్రీవారిని 75వేల 59 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 27వేల 411 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 13లక్షల రూపాయలు వచ్చింది.