Leading News Portal in Telugu

 చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ 19 కి వాయిదా


posted on Sep 15, 2023 1:13PM

మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబుకు ఈరోజు కూడా ఊరట లభించలేదు.విజయవాడలోని ఏసీబీ కోర్టులో  ఆయన దరఖాస్తు చేసుకున్న  బెయిల్ పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. విచారణను ఈ నెల 19వ తేదీకి  వాయిదా వేసింది. కౌంటర్ వేయడానికి సీఐడీ న్యాయవాది గడువు కోరడంతో… 19లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ జరిపితే క్వాష్ పిటిషన్ పై ప్రభావం పడుతుందని జడ్జి అభిప్రాయపడ్డారు.