తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు | devotees rush in tirumala| hundi| kanukalu| sarvadarshanam
posted on Oct 3, 2023 7:17AM
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.
మంగళవారం (అక్టోబర్ 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. ఇక సోమవారం (అక్టోబర్ 2) శ్రీవారిని 80వేల 551 మంది దర్శించుకున్నారు.
వారిలో 32 వేల28 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకలు 4 కోట్ల 22లక్షల రూపాయలు.