మూడు కోర్టులు.. ఆరు తీర్పులు.. సర్వత్రా ఉత్కంఠ | babu quash pitition hearing in supreme| acb| high| judgements| excitement
posted on Oct 9, 2023 9:38AM
ఏపీలోని జగన్ సర్కార్ కక్ష సాధింపులో భాగంగా విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై వరుసగా కేసులు బనాయిస్తోంది. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సోమవారం (అక్టోబర్ 9)న సుప్రీం కోర్టు విచారించనుంది. అది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు కేసులలో హైకోర్టు సోమవారం నాడే తీర్పులు వెలువరించనుంది. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిలు పిటిషన్ లపై తీర్పు రానుంది. మొత్తంగా ఈ తీర్పుల విషయంలో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావద్ధేశంలో ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉంది.
ముఖ్యంగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. కేవలం సాంకేతిక అంశాల కారణంగా ఏసీబీ, హైకోర్టులలో ఆయన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయ్యిందనీ, సరైన ఆధారాలు చూపకుండా చంద్రబాబును అరెస్టు చేయడమే కాకుండా.. ఇప్పుడు ఎలాగూ అరెస్టు చేశాము కనుక ఆయనను విచారించి ఆధారాలు సేకరిస్తామంటూ ఏపీ సీఐడీ వింత వాదనను తెరమీదకు తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో 17ఏ సెక్షన్ వర్తిస్తుందా? వర్తించదా? అన్న అశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ నెల 3న సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చంద్రబాబు బెయిల్ కోసం వెళ్ల కుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని పేర్కొన్నారు. 17 సవరణ 2018లో జరిగిందనీ, కానీ స్కిల్ స్కాం అంతకు ముందే జరిగిందనీ ముకుల్ రోహత్గీ వాదించారు.
ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోగా సమర్పించాలని సుప్రీం కోర్టు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీని ఆదేశించింది. డాక్యుమెంట్లు అన్నీ హైకోర్టు ముందు ఉంచారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉన్నందును విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కాగా సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చంద్రబాబు బెయిల్ కోసం వెళ్ల కుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని పేర్కొన్నారు. 17 సవరణ 2018లో జరిగిందనీ, కానీ స్కిల్ స్కాం అంతకు ముందే జరిగిందనీ ముకుల్ రోహత్గీ వాదించారు.
ఆ సందర్భంగా సుప్రీం కోర్టు 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఆ దశలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని ముకుల్ రోహత్గీ పేర్కొంటే జస్టిస్ బేలా త్రివేది వెంటనే అవీనీతి సంగతి తరువాత ముందు 17ఏ గురించి మాత్రమే చెప్పండని నిలువరించారు. అంతే కాకుండా సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? అన్ని కేసులకూ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఆ దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుని 17ఏ అన్ని కేసులకూ వర్తిస్తుందని చెప్పారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే ఈ సొందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ ఒక్క ఆధారం చూడా చూపలేకపోయిందని మరో న్యాయవాది మను సింఘ్వీ పేర్కొన్నారు.
కేసు విచారణలో భాగంగా జస్టిస్ అనిరుధ్ బోస్ అసలు స్కిల్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదందనీ అడిగారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే 2021 డిసెంబర్ 9న ఎఫ్ ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేస్తున్నారని న్యాయమూర్తులకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబునాయుడిని సుదీర్ఘ కాలం జైల్లో ఉంచాలన్న ఏకైక లక్ష్యమే ఉందని స్పష్టంగా కనిపిస్తోందని బాబు తరఫున వాదించిన మరో న్యాయవాది సిద్ధార్థ లూధ్రా పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును వచ్చే సోమవారానికి అంటే అక్టోబర్ 9కి వాయిదా వేస్తూ అప్పటి లోగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదిని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం ఆభిప్రాయపడుతున్నారు.