posted on Nov 7, 2023 8:40AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా అనుమతి ఇస్తున్నారు.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 66 వేల 312 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 22 వేల రెండు మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 70లక్షల రూపాయలు వచ్చింది.