Leading News Portal in Telugu

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Nov 24, 2023 8:07AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం(నవంబర్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.

ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలత సమయం పడుతోంది. గురువారం (నవంబర్ 23) శ్రీవారిని 45వేల 503 మంది భక్తులు దర్శించుకున్నారు.

వీరిలో 22 వేల96 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 27లక్షల రూపాయలు వచ్చింది.