posted on Dec 9, 2023 6:19AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (డిసెంబర్ 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులను డైరెక్ట్ లైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. శుక్రవారం (డిసెంబర్ 8) శ్రీవారిని 54 వేల 523 మంది దర్శించుకున్నారు.
వారిలో 20 వేల 817 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 40 లక్షల రూపాయలు వచ్చింది.