శ్రీవారి దర్శనం కోసం పాతిక కంపార్ట్ మెంట్లలో భక్తులు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Jan 17, 2024 8:20AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అధికంగా ఉంది. బుధవారం (జనవరి 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు పాతిక కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 73వేల 16 మంది దర్శించుకున్నారు.
వారిలో 20, 915 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 46లక్షల రూపాయలు వచ్చింది.