తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Jan 20, 2024 8:24AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
శనివారం (జనవరి 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఇక శుక్రవారం (జనవరి 19) శ్రీవారిని మొత్తం 69వేల 874 మంది దర్శించుకున్నారు.
వారిలో 26,034 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 39లక్షల రూపాయలు వచ్చింది.