Leading News Portal in Telugu

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై అరెస్ట్ వారెంట్ 


posted on Feb 2, 2024 12:36PM

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవటంతో వారెంట్ ను గత విచారణలోనే న్యాయస్థానం జారీ చేసింది. ఇవాళ్టి విచారణకూ వంశీ హాజరుకాకపోవటంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలించింది. ప్రస్తుతం వల్లభనేని వంశీ నియోజకవర్గంలో అందుబాటులో లేనట్లుగా తెలుస్తోంది. గతకొంతకాలంగా ఆయన నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్ లో ఉంటున్నారని సమాచారం. అయితే, తాజా పరిణామాలపై వల్లభనేని వంశీ ఎలా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే.