Leading News Portal in Telugu

గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు దేశం శాసనసభ్యుల వాకౌట్ 


posted on Feb 5, 2024 12:32PM

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ప్రధాన ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేమని డిసైడ్ అయినట్టుంది.  ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రాథమిక హక్కు. ప్రతపక్షాల గొంతునొ క్కేయాలని వైసీపీ  ప్రభుత్వం మొదటి నుంచే భావిస్తుంది. ప్రతిపక్షమే లేకుండా నియంత పాలన సాగించాలని ముఖ్యమంత్రి జగన్ భావనలా కనిపిస్తోంది. సోమవారం టిడిపి ఎమ్మెల్యేలు  అసెంబ్లీలో వాకౌట్ చేశారు.     వైసీపీ పని అయిపోయిందని హిందూపురంటిడిపి శాసనసభ్యులు బాలకృష్ణ ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. . ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పడంతో వివాదం రాజుకుంది. గవర్నర్ ప్రకటన టిడిపి నొచ్చుకుంది.గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్.. మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందంటూ నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని విమర్శించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు. విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని గవర్నర్ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో తీవ్ర నిరసన నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని విమర్శించారు. వైసీపీ పాలన అంతా డొల్లా అని, సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందలేదని పేర్కొన్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని, విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని గవర్నర్ చెప్పడం దారుణం అని, ఆయన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కేవలం రాజకీయ లబ్దికోసమే అని అన్నారు. మెగా డిఎస్సీ కాదు అది దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు.  అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని, నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు. బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో, వారు బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు.