తిరుమల శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Feb 8, 2024 8:06AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (ఫిబ్రవరి 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 65వేల683 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 21 వేల 177 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 59లక్షల రూపాయలు వచ్చింది.