posted on Feb 9, 2024 6:58AM
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది
. శుక్రవారం (జనవరి 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. గురువారం (జనవరి 8) శ్రీవారిని మొత్తం 57 వేల 357 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 18 వేల 924 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చింది.