Leading News Portal in Telugu

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు | devotees rush in tirumala| hundi| kanukalu| sarvadarshanam


posted on Feb 12, 2024 6:24AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.

సోమవారం (ఫిబ్రవరి 12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 72 వేల 256 మంది దర్శించుకున్నారు.

వారిలో 28 వేల 20 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల నాలుగు లక్షల రూపాయలు వచ్చింది.