posted on Feb 17, 2024 6:08AM
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శనివారం(ఫిబ్రవరి 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం(ఫిబ్రవరి 16) శ్రీవారిని మొత్తం 77 వేల 483 మంది దర్శించుకున్నారు.
వారిలో 19వేల 276 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్ల రూపాయలు వచ్చింది.