Leading News Portal in Telugu

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.09 కోట్లు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Feb 26, 2024 9:40AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం శ్రీవారిని మొత్తం 76వేల మంది దర్శించుకున్నారు. వారిలో 23వేల577 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

 శ్రీవారి హుండీ ఆదాయం 5.09 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం శ్రీవారి సర్వదర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు.  టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు స్వామి వారిని దర్శించుకునేందుకు పది గంటలకు పైగా సమయం పడుతోంది.