శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.84 కోట్లు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Feb 28, 2024 7:53AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం(ఫిబ్రవరి 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం (ఫిబ్రవరి 27) శ్రీవారిని 63,421 మంది దర్శించుకున్నారు.
వారిలో 19,644 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.84 కోట్లు వచ్చింది.