Leading News Portal in Telugu

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.84 కోట్లు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Feb 28, 2024 7:53AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం(ఫిబ్రవరి 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.  

టోకెన్లు లేని భక్తులకు  శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం (ఫిబ్రవరి 27)  శ్రీవారిని   63,421 మంది దర్శించుకున్నారు.

వారిలో  19,644 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.84 కోట్లు వచ్చింది.