Leading News Portal in Telugu

దేవరగట్టు ఉత్సవంలో 70 మందికి గాయాలు! | banni festival


posted on Oct 13, 2024 6:52PM

దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం వల్ల 70 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. కర్నూలు జిల్లా హోళగుంద సమీపంలోని దేవరగట్టులో ప్రతి ఏటా దసరా సందర్భంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం సందర్భంగా ప్రజలు కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటారు. ఇది ఈ ప్రాంతంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ఆపటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతి సంవత్సరం జరిగే ఈ బన్నీ ఉత్సవం సందర్భంగా గతంలో ఎన్నోసార్లు కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా వున్నాయి. అయినప్పటికీ ఈ సంప్రదాయం ఆగలేదు. ఈ సంవత్సరం భారీ స్థాయిలో బన్నీ ఉత్సవం జరిగింది. ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. 70 మంది ఈ సందర్భంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమించిందని సమాచారం. ఈ సంవత్సరం ఇలా జరిగిందని వచ్చే సంవత్సరం జనం ఆగరు. కర్రలతో కొట్టుకోవడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో షరా మామూలే.