posted on Nov 9, 2024 2:38PM
పాకిస్థాన్లోని బలూచిస్తాన్లోని క్వెట్టా రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 24 మంది దుర్మరణం చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో స్టేషన్ రద్దీగా ఉంది. దీనివల్లే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది . ప్లాట్ఫారమ్పై నుంచి పెషావర్కు వెళ్లేందుకు రైలు సిద్ధంగా ఉంది. ఈ సమయంలోనే పేలుడు సంభవించింది.కొనఊపిరితో కొట్టు మిట్టాడే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.