Leading News Portal in Telugu

TS Assembly: ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగ ప్రసంగం.. ఆ అంశాలపైన స్పెషల్ ఫోకస్.. – Telugu News | TS Assembly: CM KCR is likely to speak at length in the rainy session of the Telangana Assembly today


సీఎం ప్రసంగంతోపాటు స్వల్పకాలిక చర్చ ఉండటంతో శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. శనివారం అసెంబ్లీ ఆమోదించిన ఐదు బిల్లులపై మండలిలో చర్చ జరగనుంది. ఇందులో గత ఏడాది ఆర్ధిక లెక్కలు, అప్రొప్రియేషన్ అకౌంట్స్‌‌పై కాగ్ అందించిన రిపోర్టును ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఉభయ సభల ముందు ఉంచనున్నారు. దీంతోపాటు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకునే ఆలోచనలో కేసీఆర్ సర్కార్ ఉంది.  

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం- రాష్ట్ర ప్రగతిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎన్నికల ముందు అసెంబ్లీ సమావేశాలు కావడంతో సీఎం కేసీఆర్ ప్రసంగం కీలకంగా ఉంటుందంటున్నారు బీఆర్ఎస్‌ నేతలు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి వివరించనున్నారు సీఎం కేసీఆర్‌. అదే సమయంలో ఇదే అంశంపై శాసనసభ, మండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. జీరో అవర్‌ తర్వాత మొదలుకానున్న చర్చ జరుగనుంది. కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టనున్నారు మంత్రి హరీష్‌ రావు. అలాగే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కూడా ట్రాన్స్‌పోర్ట్‌, రోడ్ అండ్ బిల్డింగ్స్‌కి సంబంధించిన పేపర్స్‌ను సభ ముందు ఉంచుతారు. అటు…. శనివారం శాసనసభలో ఆమోదించిన 5 బిల్లులను ఇవాళ శాసనమండలిలో ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదించనున్నారు. మండలిలోనూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై చర్చించనున్నారు.

గతవారం ప్రారంభమైన శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలునేటితో ముగియనుండటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై ఈ చర్చ జరుగనుంది. ఈ ఏడాది చివరి నెలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉండొచ్చని అంచనా.. అయితే, ఇప్పుడు జరుగుతున్న సమావేశాలే చివరివి పరిగణిస్తున్నారు. అందుకే ఇవాళ జరుగుతున్న స్వల్పకాలిక చర్చ అంశాన్ని అజెండాలో పెట్టారు. రాష్ట్ర ఆవిర్భావం మొదలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర పురోగతిని శాసనసభ వేదికగా ప్రజలందరికీ వివరించేలా ప్లాన్ రెడీ చేశారు. అయితే, శాసనసభ, మండలిలో స్వల్పకాలిక చర్చకు సీఎం కేసీఆర్ జవాబు చెప్పనున్నారు.

సీఎం ప్రసంగం సుదీర్ఘంగా సాగనుంది..

ఇవాళ్టి సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం సూదీర్ఘంగా ఉంటుందని తెలుస్తోంది. 2014 జూన్ రెండో తేదీ నుంచి తెలంగాణలో జరిగిన ప్రగతి, తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణను సభ ముందు పెట్టనున్నారు. కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. సీఎం ప్రసంగంతోపాటు స్వల్పకాలిక చర్చ ఉండటంతో శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.

శనివారం అసెంబ్లీ ఆమోదించిన ఐదు బిల్లులపై మండలిలో చర్చ జరగనుంది. ఇందులో గత ఏడాది ఆర్ధిక లెక్కలు, అప్రొప్రియేషన్ అకౌంట్స్‌‌పై కాగ్ అందించిన రిపోర్టును ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఉభయ సభల ముందు ఉంచనున్నారు. దీంతోపాటు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకునే ఆలోచనలో కేసీఆర్ సర్కార్ ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం