Leading News Portal in Telugu

Chess Championship: విశాఖలో నేటి నుంచి జాతీయ అండర్-11 చెస్ చాంపియన్ షిప్ పోటీలు


విశాఖపట్నం వేదికగా జాతీయ అండర్‌–11 చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నేటి( ఆదివారం ) నుంచి విశాఖ పోర్ట్‌ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఆంధ్ర చెస్‌ సంఘం, ఆల్‌ విశాఖ చెస్‌ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన ఫిడే రేటింగ్‌ చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. పదకొండు రౌండ్ల పాటు సాగే ఈ పోటీలు 7వ తేదీతో ముగియనున్నాయని ఆంధ్ర చెస్‌ సంఘం అధ్యక్షుడు కేవివి శర్మ వెల్లడించారు.

అయితే, జాతీయ అండర్-11 చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో గెలిచిన విజేతకు 70 వేల రూపాయల ప్రోత్సాహకం అందించనుండగా ఏడు నుంచి ఇరవై స్థానాల్లో నిలిచిన బాల బాలికలకు సైతం పది వేల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో 386 మంది అండర్‌ 11 బాలబాలికలు పోటీ పడుతున్నారు. టోర్నీ టాప్‌ రేటింగ్‌తో కర్ణాటకకు చెందిన అపార్‌ పోటీ పడుతుండగా ఏపీ తరఫున అందాలమాల 17వ ర్యాంక్‌తో ఎత్తులు స్టార్ట్ చేయనుంది.