Nikhat Zareen: భారత బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్లో ఓడిపోయింది. బాక్సింగ్లో స్వర్ణ పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. 50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో నిఖత్ జరీన్ థాయ్లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమి పాలైంది. దీంతో బాక్సింగ్లో స్వర్ణ పతకం సాధించాలన్న భారత్ కల చెదిరిపోయింది. అయితే నిఖత్ జరీన్ ఓడిపోయినా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడలు 2023లో భారత్కు ఇది 43వ పతకం. నిఖత్ జరీన్ ఓటమి టోర్నీకి పెద్ద తలకిందులైంది.
అంతకుముందు శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ జోర్డాన్కు చెందిన హనన్ నాజర్ను ఓడించి సెమీ ఫైనల్స్కు చేరుకుంది. ఈ విజయం తర్వాత.. నిఖత్ జరీన్ కూడా పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం తన కోటాను బుక్ చేసుకుంది. ఆ మ్యాచ్ లో చాలా దూకుడుగా ఆడి.. మూడు నిమిషాల రౌండ్లో తమ ప్రత్యర్థి ఆటగాడిని కేవలం 53 సెకన్లలో ఓడించింది. కానీ ఈ మ్యాచ్ లో 2-3తో థాయ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గెలిచి నిఖత్ జరీన్ బంగారు పతకాన్ని గెలుచుకోవడంలో విజయవంతమవుతుందని అందరు నమ్మారు. కానీ భారతీయ ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. క్వార్టర్ ఫైనల్లో జోర్డాన్కు చెందిన హనన్ నాసర్ను ఓడించి సెమీ-ఫైనల్లోకి ప్రవేశించినప్పటికీ.. సెమీస్ లో నిరాశపరిచింది.
🥉🇮🇳 Bronze finish for Nikhat Zareen!
⏩ Follow @thebharatarmy on Instagram and X for instant updates on the Asian Games 2022.
📷 Pic belongs to the respective owners • #boxing #AsianGames2022 #AsianGames2023 #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/3D4YEI2miX
— The Bharat Army (@thebharatarmy) October 1, 2023