Leading News Portal in Telugu

World Billiards Championship: చరిత్ర సృష్టించిన పంకజ్ అద్వానీ.. 26వ సారి టైటిల్ కైవసం



Pankaj

భారత స్టార్ క్యూ ప్లేయర్ పంకజ్ అద్వానీ చరిత్ర సృష్టించాడు. ఈరోజు(మంగళవారం) జరిగిన ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 1000-416 పాయింట్ల తేడాతో సౌరవ్ కొఠారీని ఓడించి.. 26వ సారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. సౌరవ్ కూడా భారత్ కు చెందిన ఆటగాడే.

Read Also: National Herald case: రాహుల్, సోనియాగాంధీలకు ఈడీ షాక్.. రూ. 752 కోట్ల ఆస్తులు సీజ్..

పంకజ్ 2005లో తన తొలి ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతను సుదీర్ఘ ఫార్మాట్‌లో తొమ్మిది సార్లు టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతను పాయింట్ ఫార్మాట్‌లో ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచాడు. అంతేకాకుండా.. ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. అద్వానీ సెమీ ఫైనల్‌లో ఇండియాకు చెందిన రూపేష్ షాపై 900-273 తేడాతో విజయం సాధించాడు. సౌరవ్ కొఠారీ 900-756తో ధ్రువ్ సిత్వాలాపై విజయం సాధించాడు.

Read Also: Supreme Court: ఢిల్లీ వాయిు కాలుష్యం.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీం ఫైర్.. రైతులను విలన్లుగా చూపోద్దు..

ఇప్పటి వరకు పంకజ్ అద్వానీ కెరీర్ అద్భుతంగా సాగడం గమనార్హం. అతను 1999లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌లో పంకజ్ పాల్గొన్నాడు. అతను 2005లో IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. పంకజ్.. గ్రాండ్‌ డబుల్‌ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించి.. భారత్‌కు బంగారు పతకాన్ని అందించాడు. 2010 ఆసియా క్రీడల్లో సింగిల్స్ లో పాల్గొని.. పంకజ్ బంగారు పతకం సాధించాడు. 2006 ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించాడు.