Leading News Portal in Telugu

U-19 WC: బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం..


U-19 WC: బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం..

అండర్ -19 వరల్డ్ కప్ లో భారత్ బోణీ కొట్టింది. బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ తర్వాత 252 పరుగుల పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 167 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (76), ఉదయ్ సహారన్ (64) పరుగులతో రాణించారు. ఇక బౌలర్లలో శౌమీ పాండే 4 వికెట్లు, ముషీర్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.


Vishweshwar Reddy: ఎంపీ రంజిత్ రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు..

బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(54) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బౌలర్లలో మరూప్‌ మిరందా 5 వికెట్లు పడగొట్టాడు. కాగా.. ఈ మెగా టోర్నీలో టీమిండియా తర్వాత మ్యాచ్‌లో జనవరి 25న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది.