Leading News Portal in Telugu

First Day Lunch Break Of India vs New Zealand Third Test Match


  • న్యూజిలాండ్ టెస్టులో రెచ్చిపోయిన వాషింగ్టన్ సుందర్..

  • లంచ్‌ విరామం సమయానికి 92 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్..
IND vs NZ: 3 వికెట్లు కోల్పోయిన కివీస్.. లంచ్‌ బ్రేక్‌ వరకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..?

IND vs NZ: ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం లంచ్‌ బ్రేక్ సమయానికి కివీస్ 3 వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది. క్రీజ్‌లో విల్‌యంగ్ (38*), డారిల్ మిచెల్ (11*) బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్‌ డెవన్ కాన్వే (4)ను ఔట్‌ చేసిన యువ పేసర్ ఆకాశ్‌ దీప్‌ టీమిండియాకు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ రంగంలోకి స్పిన్నర్లను దించాడు. దీంతో వాషింగ్టన్‌ సుందర్, రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా పదునైన బౌలింగ్‌తో న్యూజిలాండ్ ను అడ్డుకున్నారు.

కాగా, ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ టామ్‌ లేథమ్‌ (28), రచిన్‌ రవీంద్ర (5)ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయగా.. వీరిద్దరినీ బౌల్డ్‌ అవడం గమనార్హం. ఆ తర్వాత డారిల్ మిచెల్‌తో కలిసి విల్‌ యంగ్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏడు ఓవర్లలో 20 రన్స్ జోడించారు. అయితే, రెండో టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సుందర్‌ ఈ మ్యాచ్‌లోనూ మరోసారి తన విశ్వరూపం చూపిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ రెండు మార్పులు చేసింది. టిమ్‌ సౌథీ స్థానంలో మ్యాట్‌ హెన్రీ, మిచెల్‌ సాంట్నర్‌ గాయపడటంతో అతని స్థానంలో ఐష్‌ సోధి తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్‌ సైతం ఓ మార్పు చేయగా.. బుమ్రా స్థానంలో సిరాజ్‌ జట్టులోకి వచ్చాడు.