ఈ క్రాకర్స్ ఎక్కడ కొన్నారు? ‘9 PM, 9 minute’పై అశ్విన్ సెటైర్స్!!
హైదరాబాద్: కరోనా కట్టడికి యావత్ భారతం ఐక్యంగా పోరాడుతుందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘9 PM, 9 minute’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపునకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. కశ్మీర్ నుంచి కన్యా కుమారి దాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ప్రతీ ఒక్కరు ఆదివారం రాత్రి 9 నిమిషాల పాటు లైట్లను ఆపేసి.. ఇంటి గడపల ముందు, బాల్కానీల్లో నలుదిక్కులా దీపంతల్లో జ్యోతులు వెలిగించి సంఘీభావం తెలిపారు.
చిన్న, పెద్ద తేడా లేదు.. కులం, మతం అనే భేదం లేదు .. పూరి గుడిసే, అపార్టమెంట్ అనే వ్యత్యాసం లేదు.. అందరూ ఈ ఐక్యతా జ్యోతిలో పాలుపంచుకున్నారు. మహమ్మారిపై పోరాటానికి మేము సైతం అంటూ సమైక్యతను చాటారు. యావత్ క్రీడాలోకం కూడా ప్రధాని పిలుపుకు మద్దతును ప్రకటిస్తూ ప్రమిదలు వెలిగించింది. గత నెల ‘23న జనతా కర్ఫ్యూ’కు కూడా ఇదే విధమైన మద్దతు లభించింది.