- అతిపెద్ద స్మార్ట్ టీవీ
- 116.5-అంగుళాల డిస్ప్లే
- థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్
ఎలక్ట్రానిక్ కంపెనీలు వినియోగదారులకు స్మార్ట్ ఫీచర్లు, థియేటర్ ఎక్స్పీరియన్స్ తో స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు స్వదేశీ కంపెనీ అతి పెద్ద స్మార్ట్ టీవీని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఏకంగా 116.5-అంగుళాల డిస్ప్లేతో రానున్నట్లు తెలిపింది. ఇండ్కల్ టెక్నాలజీ తన అతిపెద్ద స్మార్ట్ టీవీని ప్రవేశపెట్టింది. కంపెనీ తన ఇన్-హౌస్ బ్రాండ్ వోబుల్ డిస్ప్లే బ్యానర్ కింద ఈ టీవీని ప్రవేశపెట్టింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్మార్ట్ టీవీ అని బ్రాండ్ పేర్కొంది. కంపెనీ వోబుల్ మాగ్జిమస్ సిరీస్లో మూడు స్క్రీన్ సైజుల ఆప్షన్ను ఇచ్చింది.
ఈ సిరీస్లోని అతిపెద్ద మోడల్ 116.5-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ 5.0 పై పనిచేస్తుంది. కంపెనీ ఇంకా ఈ టీవీని విడుదల చేయలేదు. బ్రాండ్ దాని కీ ఫీచర్లను ఆవిష్కరించింది. వోబుల్ మాగ్జిమస్ సిరీస్లో QLED + MiniLED డిస్ప్లే టెక్నాలజీ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది . ఈ టీవీలు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా గూగుల్ టీవీ 5.0 తో వస్తాయి. ఇండ్కల్ టెక్నాలజీ ప్రకారం, ఈ టీవీలు 2000 Nits గరిష్ట ప్రకాశంతో వస్తాయి.
ఇది HDR, డాల్బీ అట్మోస్లను సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ స్క్రీన్ 4K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో వస్తుంది. ఇది నెక్స్ట్ జనరేషన్ కన్సోల్ గేమింగ్, PC కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 240W సౌండ్ అవుట్పుట్ కలిగి ఉంటుంది. దీనికి రెండు వూఫర్లు ఉంటాయి. వోబుల్ డిస్ప్లే ప్రధాన దృష్టి డిస్ప్లే టెక్నాలజీలో పరిశోధన, ఆవిష్కరణలపై ఉంది. ఇది భారతదేశంలో ఏసర్, బ్లాక్ అండ్ డెక్కర్ బ్రాండ్ టీవీలు, ఇతర గృహోపకరణాలను విక్రయించే ఇండ్కల్ టెక్నాలజీలో ఒక భాగం. వోబుల్ మాగ్జిమస్ సిరీస్ టీవీల ధరలను కంపెనీ ప్రకటించలేదు. ఈ నెలాఖరులోగా బ్రాండ్ స్మార్ట్ టీవీల ధరలను ప్రకటించవచ్చు. ఈ సిరీస్లో, బ్రాండ్ 86-అంగుళాలు, 98-అంగుళాలు, 116-అంగుళాల స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది.