Leading News Portal in Telugu

Airtel: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం

భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. రూ.349 రీఛార్జ్ చేసుకునేవారికి కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డేటా వినియోగం బాగా పెరిగింది. దీంతో పాటు ఓటీటీ సేవల్ని పొందుతున్నవారి సంఖ్య కూడా పెరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ ప్రకటించింది. రూ.249 రీఛార్జ్ చేసుకున్న వారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ప్రతీ రోజు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక రూ.129 విలువైన అమెజాన్ ప్రైమ్ ఒక నెల సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ సబ్‌స్క్రిప్షన్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ నుంచి ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు, పాస్ట్‌ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ లాంటి ఇతర బెనిఫిట్స్ పొందొచ్చు.

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ.499 ప్లాన్ తీసుకుంటే ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందొచ్చు. ఈ ప్లాన్‌లో నెలకు 75 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. వీటితో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కంటెంట్, జగ్గర్‌నాట్ బుక్స్, జీ5, వింక్ ప్రీమియం లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. ఒక ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అందించే ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ రూ.749, రూ.999, రూ.1,599 ధరల్లో అందుబాటులో ఉన్నాయి.