Leading News Portal in Telugu

Telangana: ఇదేం పంచాయితీరా సామీ.. బిర్యాని లెగ్‌పీస్ చికెన్‌ది కాదంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన కస్టమర్ – Telugu News | A Man Complaints to the Police after eating biryani in Karimnagar District


కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కల్లుపల్లె గ్రామానికి చెందిన ఐలవేన కుమార్ యాదవ్ అనే వ్యక్తి జమ్మికుంట పట్టణంలోని రెడ్ బకెట్ బిర్యానీ హౌజ్ లో ఫ్యామిలీ ప్యాక్ బిర్యాని ఆర్డర్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఫ్యామలీ అంతా ఆ బిర్యాని తినేందుకు సిద్ధమయ్యారు. ఇక వారు కూర్చొని బిర్యానీ తింటుండగా ఇంతలో కుమార్ లెగ్ పీస్ బోన్ తిందామని దాన్ని తీసుకున్నాడు.

సాధారణంగా ఇంట్లో దొంగలు పడ్డప్పుడు లేదా మన విలువైన వస్తువులు పోయినప్పడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఓ కుటుంబం మాత్రం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చేసిన ఫిర్యాదుపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంటిల్లిపాది తెచ్చుకున్న బిర్యానిలో ఉన్న బోన్ చికిన్‌ది కాదంటూ పోలీసులను ఆశ్రయించింది ఆ కుటుంబం. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కల్లుపల్లె గ్రామానికి చెందిన ఐలవేన కుమార్ యాదవ్ అనే వ్యక్తి జమ్మికుంట పట్టణంలోని రెడ్ బకెట్ బిర్యానీ హౌజ్ లో ఫ్యామిలీ ప్యాక్ బిర్యాని ఆర్డర్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఫ్యామలీ అంతా ఆ బిర్యాని తినేందుకు సిద్ధమయ్యారు. ఇక వారు కూర్చొని బిర్యానీ తింటుండగా ఇంతలో కుమార్ లెగ్ పీస్ బోన్ తిందామని దాన్ని తీసుకున్నాడు. అయితే పండ్లతో దాన్ని గట్టిగా కోరిన కూడా ఎంతకు బ్రేక్ కాలేకపోయింది. దీంతో ఆ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

లెగ్ పీస్ ఎంత కొరికిన బ్రేక్ కాలేకపోవడాన్ని చూసి వాళ్లు ఆశ్యర్యపోయారు. సహజంగా చికెన్ ముక్క తేలికగా బ్రేక్ అవుతుంది. అయితే అతను చాలా సార్లు ప్రయత్నం చేసాడు. అయినా కూడా ఆ లెగ్ పీస్ బ్రేక్ కాకపోవడంతో వినియోగదారుడు కుమార్ ఆగ్రహంతో ఊగి పోయాడు. వెంటనే షాప్ కు వచ్చి నిర్వాహకుడిని కుమార్ నిలదీసాడు.
బిర్యానీలో వచ్చిన బోన్ ను చూపిస్తూ ఇది చికెన్ పీసేనా అంటూ నిలదీసాడు.. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. చివరికి ఇది గొడవకు దారితీసింది. ఇక వినియోగదారుడు కుమార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా కరీంనగర్ లోని ఫుడ్ ఇన్స్పెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అనూష జమ్మికుంట పట్టణంలోని రెడ్ బకెట్ బిర్యానీ హౌస్ లోకి వచ్చి తనిఖీలు చేశారు.

ఇవి కూడా చదవండి

వంట రూమ్ లో ఆహార పదార్థాలు సరిగా లేకపోవడమే కాకుండా శుభ్రత పాటించడం లేదన్నారు. బిర్యానీలో వచ్చిన బోన్ తో పాటు కొన్ని పదార్థాలను శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించామని రిపోర్టు రావడానికి 14 రోజుల సమయం పడుతుందని తెలిపారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత షాప్ నిర్వాకుడిపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తాన్నికి చికెన్ ముక్క పంచాయతీ జమ్మికుంట లో చర్చ కు దారి తీసింది. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని కుమార్ చెబుతున్నారు. మరోవైపు ఇప్పుడు హోటల్లో బిర్యానీ తినాలంటే.. చికెన్ ప్రియులు భయపడుతున్నారు.