Minister KTR: మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూర్చుంటా.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. – Telugu News | Minister KTR sensational comments on upcoming Telangana elections at Sircilla
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు ఓట్లు అడగడానికి వస్తే.. ప్రభుత్వ పథకాలు చెప్పి నిలదీయాలన్నారు. బీసీబంధు లోన్ కాదు.. గ్రాంట్ మాత్రమేనని.. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ప్రజలకు వివరించారు. ప్రతిపక్షాలు చెప్తేనే పెన్షన్ పెంచలేదని.. రాబోయే రోజుల్లో మరోసారి పెన్షన్ పెంచే అవకాశం ఉందని ప్రకటించారు మంత్రి కేటీఆర్. ప్రజలు గమనించాలని సూచించారు.
సిరిసిల్ల, ఆగస్టు 8: మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో.. మీ దయ ఉంటే గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూర్చుంటానంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. అయితే.. కేటీఆర్.. సడెన్గా ఎందుకీ వ్యాఖ్యలు చేశారు?.. అసలెక్కడ చేశారు?.. ఇప్పుడు చూద్దాం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సిరిసిల్లలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి.. ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. అటు.. ప్రతిపక్షాల తీరుపైనా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు ఓట్లు అడగడానికి వస్తే.. ప్రభుత్వ పథకాలు చెప్పి నిలదీయాలన్నారు. బీసీబంధు లోన్ కాదు.. గ్రాంట్ మాత్రమేనని.. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ప్రజలకు వివరించారు. ప్రతిపక్షాలు చెప్తేనే పెన్షన్ పెంచలేదని.. రాబోయే రోజుల్లో మరోసారి పెన్షన్ పెంచే అవకాశం ఉందని ప్రకటించారు మంత్రి కేటీఆర్. ప్రజలు గమనించాలని సూచించారు.
ఇంతవరకూ బాగానే ఉన్నా… ఆ సమయంలోనే.. వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసి ప్రకంపనలు రేపారు మంత్రి కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూర్చుంటా.. అన్నారు మంత్రి కేటీఆర్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్టాపిక్గా మారాయి.
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను, నవజాత శిశువులు, శిశువులలో ఎదుగుదల లోపాలు లేకుండా చూసుకునేందుకు ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC)ను, దవాఖానకు వచ్చే గర్భిణులకు మరిన్ని సేవలు అందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన… pic.twitter.com/cXMzlMsrbz
— BRS Party (@BRSparty) August 8, 2023
మొత్తంగా.. మంత్రి కేటీఆర్ కామెంట్స్ రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. సిరిసిల్ల నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కేటీఆర్.. ఎన్నికల ముందు సడెన్గా గెలుపు ఓటముల గురించి ఎందుకు కామెంట్ చేశారా?.. అన్న చర్చలు.. సిరిసిల్లలోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ ఇంట్రస్టింగ్గా మారాయ్..
మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.. ఈ క్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో తిప్పాపురం గోశాల యందు ఏర్పాటు చేసిన బయో గ్యాస్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో కలిసి పురపాలక శాఖ మంత్రి @KTRBRS ప్రారంభించారు pic.twitter.com/RL09ejUB6K
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 8, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..