
Wife Killed Husband: ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది ఓ భార్య. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు సినిమా స్థాయిలో కథ అల్లింది. చివరకు గుట్టురట్టు జైలు పాలైంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీలో వెలుగు చూసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పరిధి గుండ్లరేవుకు చెందిన భూక్య మహేష్తో అదే జిల్లా పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన లతతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మహేష్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల మహేష్ రెండు సార్లు పక్షవాతం వచ్చింది. దంపతులు ఆరు నెలల కిందటే కేపీహెచ్బీ హైదర్నగర్ పరిధిలోని రాంనరేష్ నగర్కు మారారు. విక్రమ్ అనే మరో క్యాబ్ డ్రైవర్ మహేష్ స్నేహితుడు. వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగా మహేష్ రెండు సార్లు విక్రమ్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో లతపై విక్రమ్ కన్నేశాడు.
మహేష్ లేని సమయంలో విక్రమ్ చాలాసార్లు ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో మహేష్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ ఏడాది జూన్ 22న మహేష్ కుర్చీలో కూర్చోబెట్టి ఉరివేశారు. ఆ వెంటనే మూర్ఛ వల్లే తన భర్త చనిపోయాడని భార్య లత చుట్టుపక్కల వున్న వారిని నమ్మించింది. అదే ఆమెకు దొరికిపోయేలా చేసింది. ఇంటి యజమాని దగ్గర్లోని డాక్టర్కి ఫోన్ చేయగా, మహేష్ పల్స్ ఇంకా కొట్టుకోవడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ జూన్ 23న మహేష్ మృతి చెందాడు. గొంతుపై గాయం ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్టు రాగానే మహేశ్ ది హత్య అని నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు లత(23)ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. ఆమె అసలు విషయం చెప్పింది. ప్రియుడు విక్రమ్తో కలిసి హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. అయితే లత ప్రియుడు విక్రమ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Atrocious: పోలీస్ ఉద్యోగంలో భార్య బిజీ.. బేజారై హత్యచేసిన భర్త..