Leading News Portal in Telugu

Revanth Reddy : పీజేఆర్ పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు



Revanth

టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయారెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరని.. ఒకరు ఖైరతబాద్ గణేశుడు, ఇంకొకరు పీ.జనార్దన్ రెడ్డి అని ఆయన అన్నారు. పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 20ఏళ్ల తరువాత పేజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం ఖైరతాబాద్ ప్రజలకు వచ్చిందన్నారు. విజయమ్మకు ఓటు వేస్తే రేవంత్ రెడ్డికి ఓటు వేసినట్టేనని, పీజేఆర్ హయాంలోనే మీకు ఇండ్లు వచ్చినయ్, కరెంటు వచ్చింది.. అభివృద్ధి జరిగిందన్నారు రేవంత్‌ రెడ్డి. దానం నాగేందర్ సగం హైదరాబాద్ ను ఆక్రమించుకున్నాడు కానీ.. బస్తీల్లో పేదలకు చేసిందేం లేదన్నారు. బీజేపీ చింతల రాంచంద్రా రెడ్డి మీకు కొత్త కాదు.. పాత చింతకాయ పచ్చడేనని ఆయన వ్యాఖ్యానించారు.

MP K.Laxman : కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయి

అంతేకాకుండా..’ఆయన గుడికే కాదు మీకు కూడా పంగనామాలు పెట్టిండు.. ఎన్నికల్లో పీజేఆర్ బిడ్డ విజయమ్మకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ఈ ఆడబిడ్డను గెలిపిస్తే మీ ఇంట్లో మీ ఆత్మగౌరవం నిలబడుతుంది. విజయమ్మను గెలిపిస్తే పీజేఆర్ పేరు నిలబెడుతుంది.. మీ కోసం కొట్లాడుతుంది. పంజాగుట్ట చౌరస్తాలో దివాన్ జీ దగ్గర బీడీలు అమ్ముకునే దానంను ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది కాంగ్రెస్. అలాంటి నువ్వు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తావా?
అన్నం పెట్టిన కాంగ్రెస్ కు సున్నం పెట్టడం న్యాయమేనా నాగేందర్.. ఇలాంటి దానంను ఓడించి తగిన బుద్ధి చెప్పాలి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది..’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Bengaluru: మూడు రోజుల్లో పెళ్లి.. కాబోయే భర్త ఇంటిలో శవమైన వధువు