Leading News Portal in Telugu

CM Revanth: ఢిల్లీకి సీఎం రేవంత్, భట్టి.. సడన్గా ఎందుకో తెలుసా..!



Cm Revanth

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీ వెళ్లారు. కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో సీఎం, డిప్యూటి సీఎం, మంత్రి కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్‌ చర్చించనున్నట్లు సమాచారం తెలుస్తోంది​. మరోవైపు.. పలువురు కేంద్ర మంత్రులను కూడ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసే అవకాశం ఉంది.

Suspension: విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం.. ఇద్దరు డీఈలపై వేటు

మరోవైపు.. కేబినెట్లో ప్రాతినిథ్యం లేని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిథ్యం కల్పించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే.. ఎవరికి ప్రాధాన్యత కల్పించాలనే దానిపై పార్టీ నాయకత్వంతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలపై కూడ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో హస్తం పార్టీ వ్యూహలు రచిస్తుంది.

TDP and YCP Rebel MLAs: రెబల్ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్‌ సీరియస్‌.. అనర్హతపై కీలక నిర్ణయం..!

ఇప్పటికే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి కాంగ్రెస్‌ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్‌ఎస్‌ నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్నవారితో పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లివ్వకపోయినా సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎంపీ టికెట్లివ్వలేని వారికి కార్పొరేషన్‌ పదవులిచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీకి వెళ్లారని సమాచారం. దీనికి తోడు రేపు ఆర్థిక, రైల్వే శాఖ కేంద్ర మంత్రులతో సీఎం బృందం సమావేశం కానుంది. దీంతో పాటు ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.