
Jagga Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. నువ్వు-నేను ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం పదా అంటూ చురకలు అంటించారు. కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ని విమర్శించే ముందు బీజేపీ హామీల గురించి ఆలోచించుకో అని గుర్తుచేశారు. ఏది మాట్లాడాలో..ఏది మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం లేనట్టు అనిపించిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలు అయ్యింది.. 20 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి.. ఉచిత బస్సు ప్రయాణం నిజం కాదా..? నీ కండ్లకు కనిపించడం లేదా? అని మండిపడ్డారు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నీ కండ్లకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి.. నీ భార్యను ఆర్టీసీ బస్సు ఎక్కించు అట్లనైన తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏమైతుందని తెలుసుకోలేని నువ్వు.. ఏం రాష్ట్ర అధ్యక్షుడువి, నువెం కేంద్ర మంత్రివి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లధనం తెస్తా..పేదల ఎకౌంట్ లో వేస్తా అని మోడీ చెప్పిన మాట గుర్తు లేదా? అని గుర్తు చేశారు.
Read also: Byjus : చెల్లించిన ఫీజు రీఫండ్ చేయకపోవడంతో బైజూస్ ఆఫీసులో టీవీ తీసుకెళ్లిన స్టూడెంట్స్
మీ పార్టీనే ఇచ్చిన హామీ అమలుచేయలేదు.. నువ్వు మమ్మల్ని ప్రశ్నించే హక్కునీకు ఎక్కడిది? అని మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తా అన్నావు.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పి.. మమ్మల్ని అడుగు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను.. నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం అన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన హామీ అమలు అయ్యిందో లేదో అడుగుదాం.. నువ్వు ధైర్యం చేస్తావా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మీద బురద జల్లాలి అని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. గుర్రం ఎక్కినోడి కథ లెక్క ఉంది కిషన్ రెడ్డి తీరు ఉందని తెలిపారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు.. తర్వాత నీకు సమాధానం చెప్తామన్నారు. కిషన్ రెడ్డి.. ఆగమేఘాల మీద రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు అయ్యాడన్నారు. బండి సంజయ్ ని కారణం లేకుండా ఎందుకు తప్పించారు చెప్పు? అని ప్రశ్నించారు. కేసీఆర్ ని బండి సంజయ్ తిడుతున్నాడు అని.. కేసీఆర్ ప్యాకేజిలో కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడని తెలిపారు.
Read also: Top Headlines @1PM : టాప్ న్యూస్
ఇది మీ పార్టీ నేతలు అంటున్న మాట అని గుర్తు చేశారు. నీ పార్టీ సంసారమే సక్కగా లేదు.. మా ఇంఛార్జీల గురించి ఎందుకు అని మండిపడ్డారు. ఇంఛార్జి ల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదన్నారు. ముందు నీ పార్టీ మీద ఉన్న బురద కడుక్కో కిషన్ రెడ్డి అన్నారు. Nvss mla గా ఓడిపోయి మైండ్ ఖరావ్ అయ్యిందన్నారు. బెంజ్ కారు పెద్ద పనా.. నెలకు లక్ష కడితే బెంజ్ కారు వస్తది అన్నారు. బెంజ్ కారు గిఫ్ట్ అనేది నవ్వులాట అని తెలిపారు. ఏం విమర్శలు చేయాలో కూడా బీజేపీకి తెలియకుండా అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మైండ్ బ్లాక్ అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కి..ఆయన కుర్చీ కాపాడుకునే శక్తే ఆయనకు లేదన్నారు. నీ కుర్చీలో కూసుంటే.. నీకు తెలియకుండానే లాగేశారని అన్నారు. నీకు దానిమీదనే సోయి లేదు.. ప్రజలు కాంగ్రెస్ కి పెట్టిన నోటి కాడి ముద్ద సంగతి ఏం సోయి ఉంది నీకు అని మండిపడ్డారు.
Ranchi Pitch: రాంచీ పిచ్ని చూసి షాక్కు గురైన బెన్ స్టోక్స్!