Leading News Portal in Telugu

Fraud: పొలిటికల్ బాండ్ పేరుతో మోసం.. రిటైర్డ్ హైకోర్టు జడ్జికే టోకరా వేసిన కేటుగాళ్లు..



Fraud

కొందరు కేటుగాళ్లు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తికే టోకరా వేశారు. కేంద్రంలోనీ అధికారంలో ఉన్న పార్టీకి పొలిటికల్ బాండ్ పేరుతో మోసం చేశారు. పొలిటికల్ బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కుటుంబం దగ్గర నుంచి రెండున్నర కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. కాగా, రిటైర్డ్ జడ్జి నుంచి నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డిలు డబ్బులు వసూలు చేశారని సమాచారం.

Read Also: Rakul Preet Singh: ర‌కుల్ సెకెండ్ ఇన్నింగ్స్.. ఫోకస్ అంతా అక్కడే?

అయితే, రెండేళ్లుగా డబ్బులు తీసుకొని బాండ్లకు సంబంధించిన రశీదులు ఈ కేటుగాళ్లు ఇవ్వలేదు.. బాండ్ల పేరుతో విరాళాలు చట్ట విరుద్దం అంటూ ఇటీవల సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడంతో.. అప్రమత్తం అయి రెండున్నర కోట్ల గురించి రిటైర్డ్ న్యాయమూర్తి వాకబు చేయగా.. సదరు పార్టీకి డబ్బులు చెల్లించకుండా తమ సొంతానికి వాడుకున్నారని తేలడంతో పోలీసులకు రిటైర్డ్ జడ్జి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి లపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.