Leading News Portal in Telugu

Suicide : యువతి వేధింపులు.. యువకుడు ఆత్మహత్య



Karnataka Family Suicide

ఓ అమ్మాయి వేధింపుల వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి బంధువులు. కరీంనగర్ శివారులోని తీగల వంతెన పై రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలానికి చెందిన రాజశేఖర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గం మద్యంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. తన చావు కారణమైన వారిని శిక్షించాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. బైపాస్ రోడ్డు లోని ఓ మెస్ లో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి, తమతో పని చేసే అమ్మాయి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు. తమ కుమారుడు చావుకి అమ్మాయి బంధువుల వేధింపులే కారణమని వారిపై కేసు నమోదు చేయాలని మృతుడు రాజశేఖర్ రెడ్డి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Currency notes: ఈ నేత ఎంత దోచుకున్నాడో..! నెట్టింట ఫొటో వైరల్