Leading News Portal in Telugu

లాక్‌డౌన్‌లోనూ నిరంతర విద్యుత్‌ సరఫరా: మంత్రి జగదీశ్‌రెడ్డి

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను లాక్‌డౌన్‌లోనూ కొనసాగుతోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌లోనూ వినియోగ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరాకు అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌మిశ్రా, ట్రాన్స్‌కో అండ్‌ జెన్‌కో సీఎండి దేవులపల్లి ప్రభాకరరావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండి రఘుమారెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇబ్బందులకు గురికాకుండా 24 గంటలూ విద్యుత్‌సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఎక్కడా ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా విద్యుత్‌సరఫరా చేస్తున్న సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇటీవల అకాల వర్షాలు వచ్చిన నేపధ్యంలో ఎక్కడా ట్రాన్స్‌ఫార్మర్లకు ఇబ్బంది కలగ లేదన్నారు. విద్యుత్‌ వినియోగ దారులు బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం మార్చిలో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వినియోగ దారులు గత సంవత్సరం మార్చి నెల బిల్లును చెల్లించాలన్నారు. ఎక్కువ కానీ, తక్కువ వస్తే తదుపరి నెలలో వాటిని సవరిస్తామన్నారు. విద్యుత్‌ సంస్థలు ఎప్పుడూ కూడా ఎమర్జెన్సీ సమయంలో పనిచేస్తున్నారు. అలాగే వైద్యులు కూడా ఇలాంటి క్లిష్టమైన సందర్భంగా పనిచేస్తున్నారని తెలిపారు