కరోనా కేసుల్లో హైదరాబాద్ టాప్.. హైకోర్టు ఆందోళన
తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగంపైగా కేసులు హైదరాబాద్లో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 496 యాక్టివ్ కేసులుంటే.. అందులో 240 మంది బాధితులు జీహెచ్ఎంసీ పరిధి నుంచే ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో పెద్ద మొత్తంలో కరోనా బాధితులు ఉండడంపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో ఇంత పెద్దంతో కేసులు పెరుగుతుంటే పరీక్షలు ఎలా చేస్తున్నారని.. కొత్త కేసులను ఎలా గుర్తిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు అన్ని ఎన్ని టెస్టింగ్ కిట్లు ఉన్నాయో తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో 67వేల టెస్టింగ్ కిట్లే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.. అలాంటప్పుడు పెద్ద సంఖ్యలో ఉన్న కరోనా హాట్స్పాట్లో ప్రజలకు ఎలా పరీక్షలు చేస్తారని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 24 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించిది తెలంగాణ హైకోర్టు.
శుక్రవారం సూర్యాపేట జిల్లాలో ఐదుగురు, జోగులాంబ గద్వాల జిల్లాలో ఒకరికి కరోనా సోనినట్లు నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా సూర్యాపేట జిల్లాలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఆ జిల్లా ఇప్పటి వరకు 44 మందికి కరోనా వైరస్ సోకింది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 706కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 186 మంది కోలుకోగా.. 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 240 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. శుక్రవారానికి సంబంధించిన కరోనా బులెటిన్ విడుదల కావాల్సి ఉంది.