Leading News Portal in Telugu

తపాలా బీపీఎంకు కరోనా పాజిటివ్.. 26 గ్రామాల ప్రజలకు టెన్షన్..

తపాలా శాఖ పనిచేస్తోన్న ఓ బీపీఎంకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆసిఫాబాద్ జిల్లాలోని 26 గ్రామాల ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. ఆసిఫాబాద్ జిల్లాలోని 26 గ్రామాల్లో 260 మందికి ఇటీవల సదరు బీపీఎం పెన్షన్ పంపిణీ చేశారు. దీంతో ఇటు ప్రజలు.. అటు అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే ఇటీవల సదరు బీపీఎం, ఇద్దరు కుమారులు వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లి వచ్చారు. వీరికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కుమారులతో పాటు బీపీఎంకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతోఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న 13 మందిని ఆసిఫాబాద్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఇదిలావుంటే.. పెన్షన్ పంపిణీ చేసిన 26 గ్రామాల్లో 11 వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి ప్రజల వివరాలు సేకరిస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు, అతడితో పనిచేసే వారు, సన్నిహితులను 14 మందిని ఐసోలేషన్ తరలించగా, మరో 15మందిని జైనూరులోని క్వారంటైన్ కేంద్రానికి పంపారు.