Leading News Portal in Telugu

హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్.. లాక్ డౌన్ కొనసాగింపు?

తెలంగాణ రాజధాని, గ్రేటర్ హైదరాబాద్‌లో నివసించే వారికి బ్యాడ్ న్యూస్. భాగ్యనగరంలో కరోనా వైరస్ లాక్ డౌన్ మరికొన్ని రోజులు పెరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ ప్రకటించిన ప్రకారం మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అన్నిచోట్లా ఒకేవిధిగా కొనసాగుతుంది. అయితే, ఆ తర్వాత కూడా హైదరాబాద్‌లో లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మే నెలాఖరు వరకు కూడా లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నమోదవుతున్న కరోనా వైరస్ కేసులను పరిశీలిస్తే.. కచ్చితంగా రాజధానిలో లాక్ డౌన్ మే నెలాఖరు వరకు పొడిగించే చాన్స్ ఉంది. మరోవైపు జీహెఎంసీ కూడా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 26 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈనెల 17న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోనే 286 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటికే 131 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ రెండూ కలిపితే 417 కేసులు అవుతాయి. తెలంగాణలో ఉన్న మొత్తం 766 (డిశ్చార్జ్ అయిన వారితో కూడా కలిపి) కరోనా కేసుల్లో సగానికి పైగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.