మూడు వారాలు అత్యంత కీలకమన్న కేంద్రమంత్రి
దేశవ్యాప్తంగా రోజుకు లక్ష పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇప్పటివరకు 2.5 లక్షల పరీక్షలు జరిపామని వివరించారు. కరోనా పరీక్షల కోసం 166 ప్రభుత్వ ల్యాబ్స్లు పని చేస్తున్నాయని… పరీక్షల అప్గ్రేడేషన్కు చర్యలు తీసుకుంటున్నామని ఆయన కేంద్రమంత్రి చెప్పారు. హాట్స్పాట్లు, పాజిటివ్ కేసులపై నిరంతర నిఘా ఉందని అన్నారు. కరోనా ప్రభావం ముంబైపై తీవ్రంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై జరుపుతున్న పోరాటంలో రాబోయే మూడు వారాలు భారత్కు అత్యంత కీలకమని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
జనవరి 7న కరోనా వైరస్ను చైనాలో గుర్తించగానే మొదట స్పందించిన దేశాల్లో భారత్ ఒకటని వ్యాఖ్యానించారు. జనవరి 8న నిపుణుల బృందంతో సమావేశం ఏర్పాటు చేశామని, జనవరి 17న హెల్త్ అడ్వయిజరీలు విడుదల చేశామని చెప్పారు. కోవిడ్ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న దేశాల్లో ఇండియా మొదటి వరుసలో ఉందని అన్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ ఒకర ఉదాహరణగా నిలిచిందని చెప్పారు.