
G20 Summit: జీ20 సమ్మిట్ ముగిసింది.. కానీ ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జీ20 సమ్మిట్ సందర్భంగా చైనా ప్రతినిధుల మర్మమైన బ్యాగ్.. హోటల్ తాజ్ ప్లేస్లో కలకలం రేపింది. ఈ సందర్భంగా 12 గంటల పాటు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. జీ20 సదస్సు కోసం భారతదేశానికి వచ్చిన చైనా ప్రతినిధి బృందానికి తాజ్ ప్యాలెస్ హోటల్లో ఆతిథ్యం ఇచ్చారు. బ్రెజిల్ ప్రతినిధి బృందం కూడా అక్కడ ఉంది. చైనీస్ ప్రతినిధి బృందంలోని సభ్యుని వద్ద ఒక విచిత్రమైన మర్మమైన బ్యాగ్ ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఆ బ్యాగ్ని హోటల్ సెక్యూరిటీ తనిఖీ చేయలేదు. బ్యాగ్లో వింతగా కనిపించే పరికరం గురించి హోటల్ సిబ్బంది ఢిల్లీ పోలీసులకు, ఇతర భద్రతా బలగాలకు సమాచారం అందించారు. చైనా ప్రతినిధుల బ్యాగులను స్కానర్లో పెట్టాలని భద్రతా బలగాలు అభ్యర్థించాయి.
Read Also:Bigg Boss Telugu 7: అమ్మాయిల వెంటపడటం కాదు గేమ్ ఆడు ముందు.. రైతుబిడ్డను టార్గెట్ చేసిన కంటెస్టెంట్స్..
బ్యాగ్ని తనిఖీ చేసేందుకు చైనా ప్రతినిధి బృందం నిరాకరించింది. దాదాపు 10 నుంచి 12 గంటల పాటు బ్యాగ్పై గొడవ జరిగింది. 12 గంటల పాటు అదే గది బయట భద్రతా బలగాలు మోహరించారు. జీ20 శిఖరాగ్ర సమావేశం ఆదివారం ముగిసింది. కొన్ని రోజుల తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. చాలా ప్రయత్నాల తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. సెప్టెంబరు 9-10 తేదీలలో జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ రాలేదు. ఆయన స్థానంలో ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా భారత్ పలు దేశాలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో చైనా టెన్షన్ బాగా పెరిగింది. జీ-20 సదస్సులో భారత్ బలాన్ని చూసి చైనా చలించిపోయింది. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు గైర్హాజరు కావడంపై ప్రధాని మోడీ ప్రశ్నలు సంధించారు. జిన్పింగ్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా నిరాశ వ్యక్తం చేశారు.
Read Also:Devara: రిలీజ్ డేట్ ని బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ మైక్…