Leading News Portal in Telugu

Luxury Cruise Ship: 200 మంది ప్రయాణికులతో మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయిన లగ్జరీ నౌక


Luxury Cruise Ship Of Green land Stranded In Remote Part: గ్రీన్‌లాండ్‌ మారుమూల ప్రాంతంలో ఓ విలాసవంతమైన నౌక చిక్కుకుంది. ఆ లగ్జరీ నౌకలో 200 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నాయి. మూడు వారాల ట్రిప్ కోసం సెప్టెంబర్ 1వ తేదీన బయలుదేరింది ఈ నౌక. పర్యటన అనంతరం ఈ నెల 22వ తేదీన ఈ నౌక తిరిగి పోర్టుకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. గ్రీన్‌లాండ్‌ మారుమూల ప్రాంతంలో ఆ నౌక చిక్కుకుపోయింది. అక్కడి నుంచి అది ఎంత ప్రయత్నించినా కదలడం లేదు. గ్రీన్‌ల్యాండ్ రాజధాని నుక్‌కు 850 మైళ్ల దూరంలో సోమవారం మధ్యాహ్నం ఈ నౌక చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రయాణానికి ఒక్కొక్కరి నుంచి 33 వేల డాలర్లు తీసుకున్నారు. అంటే మన భారతీయ కరెన్సీలో రూ.27 లక్షల రూపాయలు.