Leading News Portal in Telugu

Sri Lankan Navy: 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం..


Sri Lankan Navy: 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం..

శ్రీలంక నావికాదళం 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. అంతేకాకుండా.. దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడటం కోసం వాడే వారి పడవలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర జాఫ్నా ద్వీపంలోని కరైనగర్ తీరంలో శనివారం మత్స్యకారులను అరెస్టు చేసి, వారి మూడు పడవలను స్వాధీనం చేసుకున్నట్లు నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి చర్యల నిమిత్తం ఈ మత్స్యకారులను కంకేసంతురై ఓడరేవుకు తరలించారు.


భారతదేశం-శ్రీలంక మధ్య సంబంధాలలో మత్స్యకారుల సమస్య వివాదాస్పద అంశంగా మారింది. ఈ క్రమంలో.. శ్రీలంక నావికాదళ సిబ్బంది పాక్ జలసంధిలో భారతీయ మత్స్యకారులపై కాల్పులు జరిపారు. అంతేకాకుండా.. శ్రీలంక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అనేక సంఘటనలలో వారి పడవలను స్వాధీనం చేసుకున్నారు.

పాక్ జలసంధి అనేది తమిళనాడును శ్రీలంక నుండి వేరుచేసే నీటి ప్రాంతం. ఇందులో రెండు దేశాల మత్స్యకారులు చేపల వేటకు వెళతారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి శ్రీలంక జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలతో భారత జాలరులను శ్రీలంక అధికారులు అరెస్టు చేసిన సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ద్వీప దేశం యొక్క నావికాదళం 2023లో శ్రీలంక జలాల్లో వేటాడటం కోసం 240 మంది భారతీయ మత్స్యకారులతో పాటు 35 పడవలను స్వాధీనం చేసుకుంది.