
Grammy Awards: సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా అందించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఇవాళ అట్టహాసంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్ లో 66వ గ్యామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు హాజరయ్యారు. అయితే, ఈ అంతర్జాతీయ సంగీత వేదికపై ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ జయకేతనం ఎగరవేశారు. వీరు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ పాటను 8 మంది కలిసి కంపోజ్ చేయగా.. అందులో జాన్ మెక్ లాగ్లిన్(గిటార్), జాకీర్ హుస్సేన్(తబ్లా), శంకర్ మహదేవన్(సింగర్), వి సెల్వగనేశ్(పెర్కషనిస్ట్), గనేశ్ రాజాగోపాలన్(వయోలిన్ విద్వాంసుడు) ఉన్నారు. ఇక, భారతీయ సంగీతం గొప్పదనాన్ని విశ్వ వేదికపై చాటిన వీరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.