Leading News Portal in Telugu

Drugs Seized: 3,300 కేజీల డ్రగ్స్ సీజ్.. పాకిస్థాన్ ముఠా అరెస్ట్



Drugs Gujarth

అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భార‌తీయ నౌకాద‌ళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగ‌ళ‌వారం నాడు ఈ భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది. ఇందులో సుమారు 3,300 కేజీల మాద‌క‌ద్రవ్యాల్ని సీజ్ చేశారు. గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్ తీరంలో ఆ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఇటీవ‌ల కాలంలో ఇదే అతి పెద్ద డ్రగ్స్ పట్టివేత అని నేవీ వెల్లడించింది. సుమారు 3089 కేజీల ఛార‌స్‌, 158 కేజీల మెటా ఫెట‌మైన్‌, 25 కేజీల మార్ఫైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఓ చిన్న షిప్‌ను నేవీ పట్టుకుంది.

Read Also: Mali : వంతెన పై నుంచి పడిన బస్సు.. 31మంది మృతి

కాగా, ఆ షిప్‌లో ఉన్న ఐదుగురు పాకిస్థానీల‌ను భారతీయ నేవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పీ8ఐ ఎల్ఆర్ఎంఆర్ నిఘా ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా పోరుబంద‌ర్ తీరం దగ్గర తిరుగుతున్న అనుమానిత షిప్‌ను గుర్తించారు. ఇక, ఆ షిప్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు నౌకాదళం అధికారులు వెల్లడించారు. అయితే, కొన్ని రోజుల క్రితం పుణెలో సుమారు 2500 కోట్లు రూపాయల ఖ‌రీదు చేసే 1100 కేజీల మెఫిడ్రోన్ అనే డ్రగ్స్ ను సైతం పట్టుకున్నారు.